శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు ఐఐటీ కళాశాలతో కియా ఇండియా సంస్థ శుక్రవారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల భవిష్యత్ కార్యచరణకు 5 ఏళ్లకుగాను కియా ఇండియా రూ.35 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చినట్లు ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె. ఎన్. సత్యనారాయణ తెలిపారు. దీని వలన కళాశాలలో మేకర్స్ ల్యాబ్, విద్యార్థులకు ఇంటర్న్షిప్, స్కాలర్షిప్, అంతర్జాతీయ అకాడెమిక్ మార్పిడి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.