శ్రీ కాళహస్తి పట్టణంలో సదరం సర్టిఫికెట్ కోసం వికలాంగులు, బదిరులు మీసేవ కేంద్రాలు, గ్రామ సచివాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆధార్ నమోదు తప్పనిసరి కావడంతో శనివారం ఏదీ సజావుగా సాగలేదు. వెబ్సైట్ పనిచేయక పోవడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈనెల 6వ తేదీ చివరి తేదీ కావడంతో, ఆదివారం కేంద్రాలు పనిచేస్తాయో లేదో తెలియక అయోమయంలో ఉన్నారు.