తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హెచ్చరించారు. శ్రీకాళహస్తిలోని ఆ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నేతలతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు మొదలైందని, జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు.