భూమన కరుణాకర్ రెడ్డికి బోజ్జల సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. భూమనను నా కారులో నేనే స్వయంగా తీసుకుని ఎస్వీ గోశాలకు వెళ్తా.. నాతో రావడానికి భూమన సిద్ధంగా ఉన్నాడా అంటూ ప్రశ్నించారు. అసత్య ప్రచారం నుంచి తప్పించుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. గోవుల విషయంలో అసత్యాలు చెప్పడం దారుణం.. హిందువులకు భూమన క్షమాపణలు చెప్పాలని బోజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు.