విద్యుత్ సాంకేతిక లోపంతో నిలిచిపోయిన ట్రైన్

55చూసినవారు
నెల్లూరు నుండి చెన్నై సెంట్రల్ వరకు వెళ్లే మెమో ట్రైన్ ఓజిలి మండలం పెద్దపరియ రైల్వేటేషన్ లో విద్యుత్ సాంకేతిక లోపంతో గంట పాటు ఆగిపోయింది. ట్రైన్ వెళ్లవలసిన ట్రాక్ కు సంబంధించిన విద్యుత్ లైన్ తెగిపోవడంతో ట్రైన్ ఆగిపోయినట్లు సమాచారం. గంటపాటు ఆగిపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

సంబంధిత పోస్ట్