ములకలచెరువు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య

73చూసినవారు
ములకలచెరువు ప్రమాదంలో మూడుకు చేరిన మృతుల సంఖ్య
ములకలచెరువు లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరిందని ఎస్సై నరసింహుడు తెలిపారు. మదనపల్లి ప్రశాంత్ నగర్ కు చెందిన సోమశేఖర్ భార్య కవిత, కుమారుడు రెడ్డి శేఖర్, కుమార్తె సిద్దేశ్వరి కదిరిలో బంధువుల అంత్యక్రియలకు బైక్ లో వెళ్లారు. ములకలచెరువు వద్ద ఐషర్ వాహనం ఢీ కొట్టడంతో తండ్రి, కుమార్తె చనిపోగా కుమారుడు, భార్యను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో రెడ్డి శేఖర్ మరణించారు.

సంబంధిత పోస్ట్