అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లి మండలం కోటకొండలో గంగమ్మ తల్లి జాతర తేదీలో మార్పులు చేసినట్లు ఆలయ కార్యనిర్వాకులు తెలిపారు. వాస్తవానికి ఈ నెల 13, 14 తేదీల్లో ప్రారంభించాల్సిన జాతర అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. కాగా గంగమ్మ జాతర ఈనెల 21, 22 తేదీల్లో జరుగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఈమేరకు ఆలయ కమిటీ సభ్యులు ప్రకటన విడుదల చేశారు. భక్తులు ఈమార్పులు గమనించాలని సభ్యులు కోరారు.