కురబలకోట: ఆస్తి వివాదం కారణంగా ఆరుగురు పై దాడి

75చూసినవారు
కురబలకోట: ఆస్తి వివాదం కారణంగా ఆరుగురు పై దాడి
ఆస్తి వివాదం కారణంగా ప్రత్యర్థులు ఒకే కుటుంబంలోని ఆరుగురు పై రాళ్లతో దాడి చేశారు. కురబలకోట మండలంలో బుధవారం సాయంత్రం జరిగిన సంఘటనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తట్టివారి పాలెం కు చెందిన రామచంద్ర, సుజాత, సురేంద్ర, మంజుల, కృష్ణమ్మ, శ్రీనివాసులు తమ భూమి లోనికి రోడ్డు చేసుకుంటుండగా కమతం పల్లెకు చెందిన రెడ్డప్ప, హరి రాళ్లతో, కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయ పరిచారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్