తంబళ్లపల్లి మండలం మద్దిరాల పల్లిలో నిన్నటి మంగళవారం 500 నాటు కోళ్లు మృతి చెందాయని గ్రామస్తులు చెబుతున్నారు. అంతుచిక్కని వింత వ్యాధితో వ్యాక్సిన్ వేసినప్పటికీ కోళ్లు చనిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కిలో నాటుకోడి మాంసం రూ. 400 ధర ఉన్న నాటు కోళ్లు మృతి చెందడంతో తమకు తీరని నష్టం వాటిల్లిందని కోళ్ల పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేశారు.