పెద్ద మండ్యం మండలంలో 2025 - 26 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంగళవారం ఎంపీడీవో శ్రీధర్ రావు తెలిపారు. 21 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అర్హులైన ఆసక్తి కలిగిన వారు మే 10వ తేదీ లోపు ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకొని ధ్రువపత్రాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని ఆయన కోరారు.