రామసముద్రం: రహదారి భద్రతా పై అవగాహన కల్పించిన పోలీసులు

50చూసినవారు
రామసముద్రం: రహదారి భద్రతా పై అవగాహన కల్పించిన పోలీసులు
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ మద్యపానం సేవించకుండా, రహదారి భద్రత నియమాలు పాటించి వాహనాల నడపాలని రామసముద్రం ఎస్‌ఐ రమేష్ బాబు అన్నారు. శనివారం రామసముద్రం మండల కేంద్రంలో రహదారి భద్రత నియమాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాహనాన్ని రహదారి భద్రతా నియమాలు పాటించి నడపాలని, ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్