జమ్మూ కాశ్మీర్లో భారత్ యుద్ధంలో పాల్గొన్న పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలం కాళ్ల తండాకు చెందిన మురళి నాయక్ విరోచిత పోరాటంలో పాకిస్తాన్ ముస్కరుల చేతిలో మృతి చెందడం విచారకరం. మురళి భౌతికంగా లేకపోయినా భరతమాత శిగలో ముద్దుబిడ్డగా నిలిచి కీర్తిశేషుడయ్యాడని ఆయన మృతికి శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నట్లు తంబళ్లపల్లి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మున్నా శుక్రవారం తెలిపారు.