తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల కొరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా కేంద్రాలలో శనివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్. మౌర్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయంలో భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని అన్నారు.