భారత్–పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుపతి రేణిగుంట ఎయిర్పోర్టులో శుక్రవారం హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేస్తూ డాగ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఎస్పీ హర్షవర్దన్ ఎయిర్పోర్టు అధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు.