తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

62చూసినవారు
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ
తిరుమలలో శుక్రవారం భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. గురువారం 69,609 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 33,144 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లువచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్