తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.ఆర్. శ్రీరామ్, నిర్మాత బండ్ల గణేష్ స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వేదాశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, పట్టు వస్త్రాలతో సత్కరించారు.