తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని బుధవారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, డైరెక్టర్ గోపీచంద్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ తదితరులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.