రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయం చేరుకున్న మంత్రి ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం నందు మంత్రికి వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.