తిరుపతి జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ నెల 12న సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ సహా డివిజనల్, మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.