విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం

50చూసినవారు
విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం
తిరుపతిలో అర్ధరాత్రి విద్యార్థినిల గదిలో ప్రిన్సిపాల్ దూరిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతిలోని లీలామహల్ సర్కిల్‌లో వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్‌లో దారుణం చోటు చేసుకుంది. కాలేజీ ప్రిన్సిపాల్ వర్మ అర్ధరాత్రి విద్యార్థినిల గదిలోకి దూరాడు. ఒక్కసారిగా ప్రిన్సిపాల్ గదిలోకి రావడంతో విద్యార్థినిలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడిని నిర్బంధించారు. అనంతరం ఈ ఘటనపై అలిపిరి పోలీసులకు నర్సింగ్ స్టూడెంట్స్ సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంతో హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్మను కఠినంగా శిక్షించాలంటూ అలిపిరి పోలీస్ స్టేషన్ ఎదుట విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్