తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. కూటమి ముఖ్య నేతలు, కార్యకర్తలతో తిరుపతిలో మంగళవారం ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా తన వద్దకు తీసుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.