తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల వసంతోత్సవాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. మంగళవారం చివరి రోజున ఉదయం సహస్రనామార్చన, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రి ఊరేగింపుతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. చివరగా మహాపూర్ణాహుతితో ఉత్సవాలు ముగిసాయి. ఆలయ అధికారులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.