తిరుచానూరులోని పద్మావతి అమ్మవారు శనివారం రాత్రి గజవాహనంపై మాడ వీధుల్లో విహరించారు. ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొలిపి, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సాయంత్రం అందంగా అలంకరించి గజవాహనంపై ఊరేగించారు. భక్తులు దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు.