తిరుమల: శ్రీవారి రథం బస్సులో చెలరేగిన మంటలు

70చూసినవారు
తిరుమల: శ్రీవారి రథం బస్సులో చెలరేగిన మంటలు
తిరుమలలో శుక్రవారం శ్రీవారి రథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ బస్సు పూర్తిగా దగ్ధమైంది. రోడ్డుపై ప్రయాణిస్తుండగా బస్సు ఇంజిన్ లో మంటలు, పొగలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు బస్సు నుంచి దూరంగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీనికి షార్ట్ సర్క్యూటే కారణమనే భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్