తిరుమల: హోటల్ యజమానులకు సీరియస్ వార్నింగ్

73చూసినవారు
తిరుమల: హోటల్ యజమానులకు సీరియస్ వార్నింగ్
తిరుమలలో హోటళ్ల నిర్వహణపై టీటీడీకి ఫిర్యాదులు అందడంతో యజమానులకు గురువారం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భక్తులకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యకరమైన, సాంప్రదాయ వంటకాలు మాత్రమే అందించాలని అడిషనల్ ఈవో ఆదేశించారు. చైనీస్ వంటకాలను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. సౌకర్యాలు, శుభ్రత విషయంలోనూ జాగ్రత్తలు తప్పక పాటించాలని టీటీడీ కోరింది. చట్టబద్దంగా నిర్వహణ లేకపోతే చర్యలు తప్పవని అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి అన్నారు.

సంబంధిత పోస్ట్