తిరుపతి: మెట్ల మార్గంలో గుండెపోటుతో యువకుడు మృతి

67చూసినవారు
తిరుపతి: మెట్ల మార్గంలో గుండెపోటుతో యువకుడు మృతి
తిరుమలలో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన 25 ఏళ్ల జాఫర్ అనే యువకుడు శనివారం బంధువులతో కలిసి తిరుపతికి వెళ్లాడు. మెట్ల మార్గంలో ఎక్కుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్