తిరుపతి నగరంలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను, అఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. నగరంలోని కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద, కరకంబాడి మార్గంలోని సిపిఆర్ అపార్ట్మెంట్ వద్ద, రామానుజ కూడలి నుండి శంకరంబాడి కూడలి వరకు పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను స్మార్ట్ సిటీ ఇంజినీరింగ్, ఆప్కాన్స్ సంస్థ ప్రతినిధులతో కలసి శుక్రవారం పరిశీలించారు.