తిరుపతి: డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయండి

83చూసినవారు
తిరుపతి: డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయండి
తిరుపతి నగరం కొర్లగుంట బైపాస్ రోడ్డులో ప్రజలు, వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం 33 వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీ, కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం, రోడ్ల గుంతల పూడిక పనులను కార్పొరేటర్ దూది కుమారి, హెల్త్, ఇంజినీరింగ్, అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్