తిరుమల శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను బలోపేతం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానంకు అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు సూచించారు. స్వామివారి కీర్తనలు, గోవింద నామావళిని రాత్రి 10 వరకు వినిపించాలన్నారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో గురువారం సాయంత్రం టీటీడీ నిర్వహణపై అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు, టీటీడీ అధికారులు సమీక్ష నిర్వహించారు.