ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉంటారని, అదే తీరున టూరిజం కూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో రాజకీయాలు చేయడం తగదని వివిధ రాజకీయ పార్టీలకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ హితవు పలికారు. గత నాలుగు రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ గోశాలలో గోవుల మృత్యువాత పడడంపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా బుధవారం ఆయన ఎస్వీ గోశాలను సందర్శించారు.