తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 3రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో మొదటిరోజు ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి దర్శనం కల్పించారు. అనంతరం శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారిని వేంచేపు చేశారు. సాయంత్రం ఉభయనాంచారులతో కలసి బుగ్గ వద్దకు ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.