తిరుపతి సంఘటన చాలా బాధాకరమైన ఘటన అని. ఇది మనసును కలచివేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం టీటీడీ పరిపాలన భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఎప్పుడూ మనసా వాచా ఎలాంటి అపశ్రుతీ జరక్కూడదు. ఓ భక్తునిగా, సీఎంగా తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యతను ఎప్పుడూ తీసుకుంటున్నానని. ఇకపైనా తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.