తిరుపతి: వివాహితకు వేధింపులు. ఆర్ఎస్ఐ‌పై కేసు నమోదు

64చూసినవారు
తిరుపతి: వివాహితకు వేధింపులు. ఆర్ఎస్ఐ‌పై కేసు నమోదు
మహిళను వేధించిన కేసులో రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌పై అలిపిరి పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నాడని, వినకపోతే తన భర్తను చంపేస్తానని ఫోన్‌లో బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. వేధింపులతో పాటు ఆర్ఎస్ఐపై అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్