కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామోహన్ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. భారత సైనికుల పట్ల గౌరవం తెలియజేస్తూ భారత సైనికులకు తలవంచి సెల్యూట్ చేస్తున్నాం. దేశ ప్రతిష్ఠను కాపాడుతున్న వీరులకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద గత ఏడాది కాలంలో 30సార్లు ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.