2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 12 నుంచి జులై 31 వరకు ఆసక్తి గల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తిరుపతి డీఈవో కుమార్ తెలిపారు. దరఖాస్తు కోసం www.openschool.org సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు.