టీటీడీ కి అమెరికా బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ దాత భాగవతుల ఆనంద్ మోహన్ గొప్ప దాతృత్వం చాటారు. ఆయన మొత్తం రూ. 1, 40, 06, 580 విలువ చేసే విరాళాలను వివిధ టీటీడీ ట్రస్టులకు అందజేశారు. ఆయన గురువారం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళాల డిడిలను అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్ నాయుడు దాతను ప్రత్యేకంగా అభినందించారు.