తిరుపతి: ఎస్వీ గోశాల ఆరోపణలపై రాజకీయ రచ్చ

76చూసినవారు
తిరుపతి: ఎస్వీ గోశాల ఆరోపణలపై రాజకీయ రచ్చ
తిరుపతి ఎస్వీ గోశాల అంశం రాజకీయం మయం అవుతోంది. గోశాల పరిస్థితిని పరిశీలించేందుకు గురువారం  కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్‌రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి వెళ్లారు. తితిదేలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. ఇదే సమయంలో వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్