తిరుపతి నగరంలోని పలు అన్నా క్యాంటీన్లను నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య శుక్రవారం తనిఖీ చేశారు. భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. క్యాంటీన్ కు వచ్చే ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.