వైజాగ్ కు చెందిన మైత్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ శ్రీనివాస రావు శనివారం శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీ. ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.