టీటీడీకి శనివారం రాత్రి నాలుగు వెండి దీపపు సమ్మెలు విరాళంగా అందాయి. బెంగుళూరుకు చెందిన రాధా కృష్ణ, శ్యామ్ సుందర్ శర్మ, శశిధర్ ఈ దీపపు సమ్మెలను విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయ మహా ద్వారం వద్ద పేష్కార్ రామకృష్ణకు దాతలు ఈ మేరకు దీపపు సమ్మెలను అందజేశారు.