తిరుపతి గంగ జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. గంగ జాతర సందర్భంగా ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం వివిధ శాఖల అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గంగ జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.