తాతయ్య గుంట గంగమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. శనివారం ఆయన తాతయ్యగుంట గంగమ్మ జాతరను పరిశీలించారు. భక్తులతో మాట్లాడారు. భక్తులకు త్వరగా దర్శనం జరిగేలా చూడాలని సూచించారు.