తిరుపతి ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదిక, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య కోరారు. జూన్ 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదుల వేదిక, ఉదయం 10. 30 నుంచి 11. 30 గంటల వరకు డయల్ యువర్ కమిషనర్ నిర్వహించనున్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు 0877-2227208కు కాల్ చేయవచ్చు అని తెలిపారు.