పెహల్గాంలో అమాయకుల హత్యపై స్పందించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి జవాన్లే రియల్ హీరోలైతే, సినీ పరిశ్రమ రీల్ హీరోలని వ్యాఖ్యానించారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ "ఆపరేషన్ సింధూర్" ద్వారా ఉగ్రవాదం అణచివేయాలని ప్రధాని మోడీ చేసిన కృషికి సినీ పరిశ్రమ మద్దతివ్వకపోవడం బాధాకరం అన్నారు. దేశపు ప్రారంభోత్సవాలకు సెలబ్రిటీలకంటే సైనికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మురళి నాయక్ మృతి పట్ల సంతాపం తెలిపారు.