తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తల్లి దర్శనాన్ని స్వీకరించారు. ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, హారతి, తీర్థ ప్రసాదాలతో కలెక్టర్ను సత్కరించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన కలెక్టర్ వెంట ఆలయ ఈవో జయకుమార్, దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.