తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు శనివారం సాయంత్రం పరిశీలించారు. జాతర నిర్వహణకు సంబంధించి భద్రత, ట్రాఫిక్, క్యూలైన్ తదితర ఏర్పాట్లను ఆయన తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం సమక్షంలో సమీక్షించారు. డ్రోన్ కెమెరా ద్వారా ట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించిన ఎస్పీ, సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.