పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అనుకూలమైన ధరలతో తుడా ఫ్లాట్స్ ను విక్రయిస్తుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోరారు. రేణిగుంట మండలం సూరప్పకశంలోని పద్మావతి నగర్ తుడా లేఔట్ ను మంగళవారం తుడా అధికారులతో కలిసి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.