తిరుపతిలోని టిటిడి మహతి ఆడిటోరియంలో స్విమ్స్ 13వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టిటిడి చైర్మన్ బి. ఆర్. నాయుడు మాట్లాడుతూ స్విమ్స్ను ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు భారీ అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. రూ. 600కోట్లతో క్యాన్సర్ బ్లాక్, స్పెషాలిటీ బ్లాక్ లాంటి ఆధునిక భవనాలు నిర్మిస్తున్నామని, 550కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని తెలిపారు.