తిరుపతి జిల్లా వెంకటగిరిలో అగ్నిమాపక సిబ్బంది బుధవారం అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అగ్రిమాపకాధికారి పి. నారాయణ మాట్లాడుతూ. రద్దీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వంటలు పూర్తయిన తర్వాత గ్యాస్ రెగ్యులేటర్లను తప్పనిసరిగా ఆఫ్ చేయాలన్నారు.