వెంకటగిరి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ

78చూసినవారు
రానున్న 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి వెంకటగిరి మండలంలోని ఎంపీపీ, జడ్పీ పి ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వెంకటగిరి ఎంఈఓ 1 వెంకటేశ్వర్లు తెలిపారు. మండల వ్యాప్తంగా ఉన్న 102 ప్రభుత్వ పాఠశాలకు అవసరమైన అన్ని పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభం అయిన వెంటనే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్